2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో అక్కసు వెళ్శగక్కిన టాటా టెలి, ఆర్ కామ్..
వీరికి తోడుగా పాత జీఎస్ ఎం ఆపరేటర్లు ఎటువంటి ధర చెల్లించకుండా అదనపు 2జీ స్పెక్ట్రమ్ పోందినట్లు అనిల్ అంబానీ ఆద్వర్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ పేర్కోంది. అంతేకాకుండా ఇటీవల ఒక టీవీ ఛానెల్ కురతన్ టాటా ఇచ్చిన ఇంటర్వ్యూని సమర్దించింది. ఈఇంటర్వ్యూలో రతన్ టాటా మాట్లాడుతూ పాత జీఎస్ ఎం ఆపరేటర్లు స్పెక్ట్రమ్ నుతమ గుప్పెట్లో పెట్టుకున్నారని టాటా గ్రూప్ కంపెనీల అధిపతి రతన్ టాటా అన్నారు. అంతేకాకుండా అదనపు స్పెక్ట్రమ్ ఉన్న వారినుండి ఆదాయాన్ని రాబట్టాలని చూచించారు.
వీరికి సమాధానంగా వోడాఫోన్ తనదైన శైలిలో సమాధానం చెప్పింది. కోత్తగా జీఎస్ఎం టెలికాం సేవలను ప్రారంభించిన ఆపరేటర్లు చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నయని చెప్పారు. నిబంధనలకు అనుగుణంగానే అదనపు స్పెక్ట్రమ్ పోందినట్లు తెలిపింది. గత దశాబ్దం కాలంగా చందాదారుల సంఖ్యకు అనుగుణంగా అపరేటర్లు ప్రభుత్వం స్పెక్ట్రమ్ కేటాయించిందని వివరించింది.