వైయస్ జగన్ పై దాడిని ముమ్మరం చేసిన కాంగ్రెసు నేతలు
జగన్ తీరు హిట్లర్ వ్యవహరించినట్లుగా ఉందని పాలడుగు వెంకట్రావు అన్నారు. జగన్ రాజీనామాతో పార్టీకి ఎలాంటి నష్టం ఉండదన్నారు. ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మరణించగానే ఇందిరాగాంధీ ప్రధాని కాలేదన్నారు. ఎనరికైనా కాస్త ఓపిక ఉండారన్నారు. జగన్ కు పార్టీ పెట్టే హక్కు ఉందని, అయితే సోనియాను విమర్షించి, ఫ్లెక్సీలు ధ్వంసం చేసే హక్కు మాత్రం లేదని మేడ్చల్ శాసనసభ్యుడు కె లక్ష్మారెడ్డి(కెఎల్ఆర్) అన్నారు. కిరణ్ తోనే కొత్త ఎమ్మెల్యేలు ఉంటారని, కొత్తవారికి మంత్రి పదవులు ఇవ్వడంలో తప్పులేదన్నారు.
తనకు మంత్రి పదవి ఫరవాలేదని జెసి దివాకర్ రెడ్డి అన్నారు. జగన్ తో వెళితే నీళ్లులేని బావిలో దూకినట్లేనన్నారు. వివేకానంద ఉన్న పార్టీలోనే ఉంటే మోసం చేసినట్టు, జగన్ బయటకు వెళ్లిపోవటం ఒప్పు చేసినట్టా అని అన్నారు. వైయస్ వివేకానంద ప్రకటనను ఆహ్వానిస్తున్నట్టు మాజీమంత్రి దామోదరరెడ్డి అన్నారు. జగన్ తీరు ప్రజాస్వామ్యయుతంగా లేదన్నారు.