హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి పదవులో కోసం ఢిల్లీలో లాబీయింగ్ చేయలేదు: వంగా గీత

By Pratap
|
Google Oneindia TeluguNews

Vanga Geetha
హైదరాబాద్‌: పదవుల కోసం తమ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కాంగ్రెసు పెద్దలతో ఢిల్లీలో లాబీయింగ్ చేయలేదని ప్రజారాజ్యం పార్టీ శానససభ్యురాలు వంగా గీత స్పష్టం చేశారు. పోలవరం తదితర ప్రాజెక్టులపైనే ప్రధాని మన్మోహన్ సింగ్ తోనూ ఇతరులతోనూ చిరంజీవి ఢిల్లీలో మాట్లాడలేదని ఆమె మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ప్రభుత్వంలో చేరుదామని కూడా తాము వ్యూహరచన చేయలేదని ఆమె అన్నారు. తమ పార్టీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో చేరడానికి వ్యూహరచన చేస్తోందనేది మీడియా సృష్టేనని ఆమె అన్నారు. అవన్నీ ఊహాగానాలేనని ఆమె కొట్టిపారేశారు.

అవసరమైతే కాంగ్రెసు పార్టీని ఆదుకుంటామని చిరంజీవి ప్రకటన చేసిన మాట వాస్తవమేనని, అయితే ఆదుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదని ఆమె అన్నారు. తమ అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతనే ప్రభుత్వంలో చేరడం లేదని చిరంజీవి ప్రకటన చేశారని ఆమె చెప్పారు. తాము ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని ఆమె చెప్పారు. తమ పార్టీ శాసనసభ్యుల్లో విభేదాలు లేవని, తామంతా చిరంజీవి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆమె చెప్పారు. ఎవరు బలపడతారో, ఎవరు బలహీన పడుతారో భవిష్యత్తు తేలుస్తుందని ఆమె ఓ ప్రశ్నకు సమాధానం అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X