హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేపే వైయస్ జగన్ క్యాంప్ వ్యూహం ఖరారు: పిల్లి వెల్లడి

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్‌: కాంగ్రెసు పార్టీకి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వైయస్ జగన్ వర్గం తమ వ్యూహాన్ని రేపు గురువారం ఖరారు చేసుకోనుంది. కాంగ్రెసులోని వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు రేపు హైదరాబాదులో సమావేశమవుతున్నారు. ఈ విషయాన్ని తన స్వగ్రామంలో ఉన్న మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వెల్లడించారు. పార్టీకి రాజీనామా చేయాలా, వద్దా అనే విషయంపై రేపు నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. తాను వైయస్ జగన్ వెంటే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. జగన్ వర్గానికి చెందిన ఐదుగురిని మంత్రి పదవులకు దూరంగా ఉంచడం ద్వారా ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెసు అధిష్టానం సంకేతాలు పంపిందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై చర్చించి కాంగ్రెసులో కొనసాగాలా, వద్దా అనే విషయంపై వైయస్ జగన్ కు చెందిన నాయకులు నిర్ణయం తీసుకుంటారు.

వైయస్ జగన్ కొత్త పార్టీ పెట్టాలని ఇది వరకే నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారంతా కాంగ్రెసు పార్టీని వదిలిపెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెసు పార్టీ అధిష్టానం కోరిక మేరకే తాను మంత్రి పదవి తీసుకోలేదని పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. మంత్రి పదవి తీసుకోవాలని అధిష్టానం తనకు సూచించిందని, అయితే అందుకు తాను ఇష్టపడలేదని ఆయన చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంతో తమ వైపు ఇంకా ఎవరైనా వస్తారా, లేదా అనే విషయంపై కూడా వైయస్ జగన్ వర్గం దృష్టి పెట్టినట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X