హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్ కుమార్ దిగ్భ్రాంతి: సురేష్ రెడ్డి, మహేందర్ రెడ్డిలతో చర్చలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్‌: అంతా సజావుగా జరిగిపోతుందని అనుకుంటున్న సమయంలో మంత్రుల్లో అసంతృప్తి జ్వాలలు చెలరేగడంపై ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పది మందికి పైగా మంత్రులు అసంతృప్తితో వేగిపోతున్నారు. తమ తదుపరి కార్యక్రమాన్ని నిర్ధారించుకోవడానికి వారు సమావేశమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి ఇంటలిజెన్స్ ఐజి మహేందర్ రెడ్డితో చర్చలు జరిపారు. అదే సమయంలో తన ప్రియ మిత్రుడు, శాసనసభ మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డితో మాట్లాడుతున్నారు.

తమకు అప్రాధాన్యమైన శాఖలు కేటాయించారంటూ సీనియర్ మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఏం చేయాలనే విషయంపై కిరణ్ కుమార్ రెడ్డి మల్లగుల్లాలు పడుతున్నారు. కాపులు, ఎస్సీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రెడ్లకే అధిక ప్రాధాన్యం ఇచ్చారని విమర్శలు వస్తున్నాయి. దీన్ని సరిదిద్దుకోవడం ఎలాగో కిరణ్ కుమార్ రెడ్డికి అంతు పట్టని విషయంగా ఉంది. శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ముఖ్యమంత్రి నివాసానికి వచ్చారు. అసమ్మతి మంత్రుల తరఫున మాట్లాడడానికి ఆయన ముఖ్యమంత్రి నివాసానికి వచ్చినట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X