రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్రపై ఉత్తరాంధ్రవాసుల కన్నెర్ర
విశాఖపట్టణంలోని శ్రీకన్న థియేటర్లో రక్త చరిత్ర పోస్టర్ ను తగులపెట్టారు. మరికొన్ని ప్రాంతాల్లో పోస్టర్లు, ఫ్లెక్సీలు ధ్వంసం చేశారు. ప్రశాంత వాతావరణం ఉన్న ప్రాంతాన్ని కక్ష్యలకు, కారుణ్యాలకు పేరుగాంచినదిగా చూపించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఉత్తరాంధ్ర పరిరక్షణ సమితి పేర్కొంటున్నారు. ఆ పేరును తొలగించకుంటే చిత్రాన్ని అడ్డుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు. ఈ కారణంగా థియేటర్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కొన్ని ప్రాంతాలలో మధ్యాహ్నం చిత్రం విడుదల కానుంది.
కాగా చిత్రంలో పరిటాల రవిగా వివేక్ ఒబేరాయ్, మద్దెలచెర్వు సూరిగా సూర్య, భానుమతి పాత్రలో ప్రియమణి, చమన్ గా సిరిలు నటిస్తున్నారు. ఎకే అనే పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం. ఎకే అంటే అనంతపురం కింగ్. ఈ పాత్రలో సుబబ్రత నటిస్తున్నారు. కాగా రక్త చరిత్ర చిత్రాన్ని వర్మ నేటివిటీ కోసం చాలా వరకు ఆయా ప్రాంతాలలోనే తీయటం గమనార్హం. జూబ్లీహిల్స్ బాంబు పేలుడు సంఘటన కోసం భారీ సెట్ వేశారు.