వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా గాంధీతో భేటీ వివరాలను చెప్పబోను: ఎస్ జైపాల్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Jaipal Reddy
న్యూఢిల్లీ: తమ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మాట్లాడిన వివరాలను తాను వెల్లడించబోనని కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి చెప్పారు. సోనియా గాంధీతో దాదాపు గంట పాటు చర్చించిన జైపాల్ రెడ్డి మీడియాతో ఆ వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన అన్ని విషయాలను తాను సోనియా గాంధీతో మాట్లాడానని ఆయన చెప్పారు. సోనియాను తాను చాలా అరుదుగా కలుస్తుంటానని, కలిసినప్పుడు రాష్ట్ర రాజకీయాలను అన్నింటినీ చర్చిస్తానని ఆయన చెప్పారు.

సోనియా గాంధీని కాంగ్రెసు శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి కలిసిన సమయంలో జైపాల్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. వారిద్దరు సోనియా గాంధీతో దాదాపు గంటకు పైగా చర్చలు జరిపారు. పిసిసి అధ్యక్ష పదవికి మర్రి శశిధర్ రెడ్డి రేసులో ఉన్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ చర్చలకు ప్రాధాన్యం చేకూరిందని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X