వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తా: మర్రి శశిధర్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Marri Sashidhar Reddy
న్యూఢిల్లీ: తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం తనకు ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. పిసిసి అధ్యక్ష పదవికి రేసులో ఉన్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన శనివారం సోనియా గాంధీని కలిసి సుదీర్ఘంగా చర్చించారు. తాను పిసిసి అధ్యక్ష పదవికి గానీ శాసనసభ స్పీకర్ పదవికి గానీ రేసులో లేనని ఆయన చెప్పారు. సోనియా గాంధీ తనను పిలువలేదని, తానే అపాయింట్ అడిగి కలిశానని ఆయన చెప్పారు. తాను మర్యాదపూర్వకంగానే సోనియాను కలిసినట్లు ఆయన తెలిపారు.

రాష్ట్రంలోని పరిస్థితుల గురించి గానీ ఇతర విషయాల గురించి సోనియా గాంధీ తనతో ప్రత్యేకంగా మాట్లాడలేదని ఆయన చెప్పారు. పదవుల విషయం కూడా తాను మాట్లాడలేదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ చేయూత అందించాల్సిన అవసరం ఉందనే ప్రస్తావన మాత్రమే వచ్చిందని ఆయన చెప్పారు. 2014లో తిరిగి పార్టీని అధికారంలోకి తేవడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం గురించి మాట్లాడినట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X