హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీ ప్రకటనతో తెలంగాణపై కేంద్రం వెనకడుగు వేయదు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ajith Singh
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీ ప్రకటించటంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విషయంలో వెనకడుగు వేస్తుందని తాను అనుకోవటం లేదని ఆర్ఎల్డీ నాయకుడు అజిత్ సింగ్ ఆదివారం హైదరాబాదులో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో పాటు ఎవరైనా తెలంగాణకు మద్దతు ఇవ్వాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు ప్రకటించకుండా ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. తెలంగాణ కోసం కేంద్రం వేసిన శ్రీకృష్ణ కమిటీ కేవలం కంటితుడుపు చర్యేనని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రత్యేక వాదం ఇప్పుడిప్పుడు వచ్చింది కాదని, అది గత యాభయ్యేళ్లుగా ఉందన్నారు.

తెలంగాణ వాదం తెలంగాణలోని పది జిల్లాల్లో గ్రామగ్రామాణ విస్తరించిందన్నారు. తెలంగాణ ఇప్పుడు కాకున్నా ఎప్పటికైనా ప్రకటించాల్సిందేనని ఆయన చెప్పారు. తెలంగాణ వాదం ప్రజలందరిలోనూ ఉన్నందున మాయమాటలు చెప్పి రాజకీయ పార్టీలు వారికి తప్పించుకోలేవని అన్నారు. వారిని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతు ప్రకటించాలని ఆయన కోరారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్లనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరికైనా రాజకీయ లబ్ధికన్నా దేశహితం ముఖ్యమని ఆయన సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X