హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రంగారెడ్డి జిల్లాలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సిఎం కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YSR Statue
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన రంగారెడ్డి జిల్లా మొదటి పర్యటనలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ విగ్రహాన్ని తాండూరులో ఆవిష్కరించారు. అనంతరం ఆయన రాజీవ్ గృహకల్ప ఇళ్లను పంపిణీ చేశారు. ఇందిరమ్మ గృహ సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హెలికాప్టర్‌లో తాండూరు చేరుకున్నారు. ఈ పర్యటనలో విద్యుత్ స్టేషన్ ను కూడా ఆయన ప్రారంభిస్తారు.

కాగా ముఖ్యమంత్రి తాండూరు పర్యటన కొంత ఉద్రిక్తంగా మారింది. కిరణ్ ను పర్యటనను అడ్డుకునేందుకు ఉస్మానియా ఐకాస ఇచ్చిన పిలుపు మేరకు తెరాస కార్యకర్తలు, విద్యార్థులు ముఖ్యమంత్రి కాన్వాయ్ కు అడ్డుగా వచ్చి తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. అయితే పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. కిరణ్ పర్యటన సందర్భంగా పోలీసులు ముందుగానే భారీగా పోలీసులు మోహరించారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా సిఎం రాకముందే కొందరు తెరాస నాయకులను అదుపులోకి తీసుకున్నారు. కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నానికి సచివాలయానికి వస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X