వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్ ఆత్మాహుతి దాడుల్లో 40 మంది దుర్మరణం

By Pratap
|
Google Oneindia TeluguNews

Peshawar Blast
పెషావర్: పాకిస్తాన్ లో సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 40 మంది మరణించారు. మరో 60 మంది దాకా గాయపడ్డారు. తాలిబన్ ఉగ్రవాదుల నిరోధ సమావేశం జరుగుతుండగా ఓ ప్రభుత్వం ఆవరణపై ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు దాడి చేసి తమను తాము పేల్చేసుకున్నారు. దీంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. మొహమ్మద్ ఏజెన్సీ హెడ్ క్వార్టర్ ఘలనాయ్ అసిస్టెంట్ రాజకీయ ఏజెంట్ కార్యాలయంపై ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు దాడి చేశాడు.

రెండో ఆత్మాహుతి దళ సభ్యుడిని పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించారు. దీంతో అతను మరో కార్యాలయం వెలుపల తనను తాను పేల్చేసుకున్నాడు. గాయపడినవారిలో 20 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తీవ్రంగా గాయపడినవారిని పెషావర్ లోని ఆస్పత్రికి తరలించారు. ఈ దాడులకు ఎవరు బాధ్యులనేది తెలియడం లేదు. ఇద్దరు సహాయ రాజకీయ ఏజెంట్లు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X