హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్ వేర్పాటు మాటలు తెలంగాణకు మేలు: దామోదర్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

R Damodar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రెండు ప్రాంతాలను వేరువేరు చేసి మాట్లాడటం అభినందించదగ్గ విషయమని మాజీ మంత్రి దామోదర్ రెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని భూములు స్వయంగా ముఖ్యమంత్రే విలువైనవని చెప్పారు. అక్కడి ప్రభుత్వ భూముల డబ్బులు అంతా ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ప్రాణహిత - చేవెళ్ల వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. ప్రాణహితకు కష్టమంటూనే జాతీయహోదాకోసం కృషి చేస్తాననటంలో అర్థమేమిటన్నారు. తెలంగాణ, సీమాంధ్ర భాస, యాసకు తేడా ఉందని ముఖ్యమంత్రే స్వయంగా ఒప్పుకున్నారన్నారు.

తెలంగాణ కోసం ఉద్యమించిన విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేసే బాధ్యత మంత్రులు జానారెడ్డి, బస్వరాజు సారయ్యలపై ఉన్నదన్నారు. డిసెంబర్ 9వ తేదిన తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకులు తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద శ్రద్దాంజలి ఘటించాలని సూచించారు. డిసెంబర్ 9వ తేదిన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతామన్నారు. డిసెంబర్ 31న శ్రీకృష్ణ నివేదిక తర్వాత రాష్ట్రంలో పరిస్థితుల తప్పకుండా మారుతాయని వ్యాఖ్యానించారు.

శ్రీకృష్ణ కమిటీ తెలంగాణకు అనుకూలంగానే నివేదిక ఇస్తుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణను మా అధినేత్రి సోనియాగాంధీ తప్పకుండా ఇస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకవేళ తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. నివేదిక వ్యతిరేకంగా ఉంటే 10 లక్షల మందితో బ్రిగేడ్ ను ఏర్పాటు చేసి పోరాడుతామని చెప్పారు. ఎమ్మార్ కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేశారు. దీనిపై డిఎల్ రవీంద్రారెడ్డి పోరాటం చేయాలన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X