కిరణ్ వేర్పాటు మాటలు తెలంగాణకు మేలు: దామోదర్ రెడ్డి
తెలంగాణ కోసం ఉద్యమించిన విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేసే బాధ్యత మంత్రులు జానారెడ్డి, బస్వరాజు సారయ్యలపై ఉన్నదన్నారు. డిసెంబర్ 9వ తేదిన తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకులు తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద శ్రద్దాంజలి ఘటించాలని సూచించారు. డిసెంబర్ 9వ తేదిన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతామన్నారు. డిసెంబర్ 31న శ్రీకృష్ణ నివేదిక తర్వాత రాష్ట్రంలో పరిస్థితుల తప్పకుండా మారుతాయని వ్యాఖ్యానించారు.
శ్రీకృష్ణ కమిటీ తెలంగాణకు అనుకూలంగానే నివేదిక ఇస్తుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణను మా అధినేత్రి సోనియాగాంధీ తప్పకుండా ఇస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకవేళ తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. నివేదిక వ్యతిరేకంగా ఉంటే 10 లక్షల మందితో బ్రిగేడ్ ను ఏర్పాటు చేసి పోరాడుతామని చెప్పారు. ఎమ్మార్ కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేశారు. దీనిపై డిఎల్ రవీంద్రారెడ్డి పోరాటం చేయాలన్నారు.