వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ శిబిరంలో ప్రస్తుతానికి చేరను: రాయపాటి సాంబశివరావు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rayapati Sambasiva Rao
గుంటూరు: వైయస్ జగన్ శిబిరంలో చేరే ఆలోచన ప్రస్తుతానికి లేదని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు చెప్పారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన అంబటి రాంబాబుతో తన భేటీలో ప్రత్యేకత ఏమీ లేదని, ఈ భేటీ పూర్తిగా వ్యక్తిగతమని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను కాంగ్రెసు పార్టీకి చాలా కాలంగా సేవలందించానని, తనకు విశ్రాంతి అవసరమని ఆయన అన్నారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన శంషాబాద్ విమానాశ్రయంలో మీడియా ప్రతినిధులతో చెప్పారు. తాను లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు.

తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ఆదివారంనాడు చెప్పారు. రెండు మూడు రోజులు రాయపాటి సాంబశివరావు హైదరాబాదులోనే ఉంటారు. ఈ సమయంలో ఆయన తన అనుచరులతో మాట్లాడుతారని తెలుస్తోంది. వ్యూహాత్మకంగానే ఆయన ప్రస్తుతానికి వైయస్ జగన్ పార్టీలో చేరబోనని ఆయన చెబుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. గుంటూరు జిల్లాకు చెందిన కన్నా లక్ష్మినారాయణకు మంత్రి పదవి ఇచ్చి, తన సోదరుడు రాయపాటి శ్రీనివాస్ కు ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. పైగా చాలా కాలంగా కన్నా లక్ష్మినారాయణకు, రాయపాటికి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. అది కోర్టులకు కూడా ఎక్కింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X