వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరంగల్ నర్సుల ఆందోళన ఉద్రిక్తం: ఇద్దరి ఆత్మహత్య యత్నం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Warangal
వరంగల్: తమ ఉద్యోగాలు క్రమబద్దీకరించాలంటూ 56 గంటలుగా నీళ్ల ట్యాంకు ఎక్కి ఆందోళన చేస్తున్న మహాత్మా గాంధీ మెమోరియల్(ఎంజిఎం) వైద్యశాల కాంట్రాక్టు నర్సుల ఆందోళన సోమవారం ఉద్రిక్తంగా మారింది. సోమవారం ఉదయం పోలీసుల వచ్చి ట్యాంకుపైనున్న నర్సులను దింపే ప్రయత్నాలకు పూనుకున్నారు. అయితే కింద ఆందోళన చేస్తున్న వారు పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులు బలవంతంగా వెళ్లడానికి ప్రయత్నాలు చేయడంతో ఇద్దరు నర్సులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ఒక నర్సు బ్లేడుతో చేతిపైన కోసుకున్నది. మరో నర్సు కిరోసిన్ ఒంటిపైన పోసుకొని అత్యహత్యాయత్నానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు వారించారు. దీంతో పోలీసులు పైకి ఎక్కకుండా ఆగిపోయారు. కాగా అధికారులు మాత్రం నర్సులను సంప్రదించలేదు. క్రమబద్దీకరణ అనేది మా చేతుల్లో లేదని వారు చేతులెత్తేస్తున్నారు. కాగా ప్రభుత్వ దిగి వచ్చే వరకు తమ ఆందోళన ఆపేది లేదని మరోవైపు నర్సులు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X