హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ పై కాంగ్రెసు నేతల ఫైర్, అంబటి రాంబాబు కౌంటర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్: కడప జిల్లా పులివెందులలో వైయస్ జగన్ తమ పార్టీ అధిష్టానంపై చేసిన విమర్సలపై కాంగ్రెసు నాయకులు తీవ్రంగా ప్రతిస్పందించారు. తన నియోజకవర్గం ప్రజలకే ఏమీ చేయలేని వైయస్ జగన్ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధికార ప్రతినిధి తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. వైయస్సార్ శవాన్ని ముందు పెట్టుకుని వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని సంతకాల సేకరణ చేపట్టారని, మద్దతు కోసం ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి వద్దకు వెళ్లారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

వైయస్ జగన్ కు కాంగ్రెసు పార్టీ చరిత్ర తెలియదని, పార్టీ అధిష్టానానికి విధేయుడిగా ఉన్నందు వల్లనే వైయస్సార్ కు ఉన్నత పదవులు దక్కాయని మంత్రి పి. శంకరరావు న్యూఢిల్లీ అన్నారు. వైయస్సార్ అభిమానులంతా కాంగ్రెసు వైపు ఉన్నారని మరో మంత్రి దానం నాగేందర్ అన్నారు. కాంగ్రెసు మహాశక్తి అని, దాన్ని ఎదురొడ్డి ఎవరూ నిలబడలేరని ఆయన హైదరాబాదులో అన్నారు.

కాంగ్రెసు నేతలపై వైయస్ జగన్ వర్గానికి చెందిన అంబటి రాంబాబు తీవ్రంగా మండి పడ్డారు. వైయస్ జగన్ అంటే ఎందుకు భయపడుతున్నారని ఆయన కాంగ్రెసు అధిష్టానాన్ని ప్రశ్నించారు. వైయస్ జగన్ కు భయపడే ముఖ్యమంత్రిని మార్చారని ఆయన అన్నారు. తులసిరెడ్డి వంటి నేతలతో నీతులు చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి తమకు పట్టలేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X