పులివెందుల నుంచి విజయమ్మ పోటీ: మారిన జగన్ వ్యూహం
కాగా, తాజాగా వైయస్ జగన్ వ్యూహం మారినట్లు కనిపిస్తోంది. పులివెందుల స్థానం నుంచి తాను పోటీ చేసి, కడప పార్లమెంటు సీటు నుంచి తన సోదరి షర్మిళను పోటీకి దించాలని మొదట ఆయన అనుకున్నారు. అయితే, చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి కాంగ్రెసు పార్టీతోనే ఉండాలని నిర్ణయించుకోవడంతో వ్యూహాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. పులివెందులలో తాను పోటీ చేస్తే కాంగ్రెసు అధిష్టానం తనపై చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డిని పోటీకి దించవచ్చునని, అందుకు వివేకానంద రెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేయవచ్చునని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వైయస్ విజయమ్మ పోటీ చేయడానికి వైయస్ వివేకానంద రెడ్డి ముందుకు రారనే అభిప్రాయం జగన్ లో ఉన్నట్లు సమాచారం. వైయస్ వివేకానంద రెడ్డి కాంగ్రెసులో ఉండడం వల్ల ఈ రెండు స్థానాల్లో కూడా తాను పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందువల్ల స్థానాలు మారకపోవడం మంచిదని ఆయన భావించినట్లు సమాచారం.