హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దుగ్గల్ సిఎం కిరణ్ కుమార్ కు ఎందుకు కలిశారో చెప్పాలి: దామోదర్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

R Damodar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ కలుసుకోవడంపై కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రిని దుగ్గల్ ఎందుకు కలిశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే సమయం దగ్గరపడుతున్న స్థితిలో దుగ్గల్ కిరణ్ కుమార్ ను కలుసుకోవడం అనుమానాలకు తావిస్తోందని ఆయన అన్నారు. దుగ్గల్ ఈ నెల 16వ తేదీన హైదరాబాదు రావాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, కెఆర్ ఆమోస్ లతో కలిసి ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.

ఈ నెల 11వ తేదీన కాంగ్రెసు తెలంగాణ నేతల సమావేశం జరుగుతుందని, ఇందులో భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటామని వారు చెప్పారు. తెలంగాణ ప్రజా సంఘాల సమన్వయ కమిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని వారు చెప్పారు. ఉద్యమకాలంలో విద్యార్థుల కేసుల ఎత్తివేతకు తెలంగాణకు చెందిన మంత్రులు కె. జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, బస్వరాజు సారయ్య పూనుకోవాలని, ఈ విషయంపై జానా రెడ్డి రేపటిలోగా సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మంత్రి పదవులు చేపట్టిన తర్వాత కేసుల ఎత్తివేతను పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X