హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సచివాలయం లోపల ఎమ్మార్పీయస్ కార్యకర్తలు, విస్తృతంగా తనిఖీలు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Seccretariat
హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఢిల్లీకి అఖిల పక్ష ప్రతినిధులను తీసుకుని వెళ్లే విషయంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నుంచి స్పష్టమైన ప్రకటనను డిమాండ్ చేస్తున్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) కార్యకర్తలు బుధవారం సచివాలయంలోకి ప్రవేశించారని అనుమానిస్తున్నారు. సచివాలయంలోకి ప్రవేశించిన కార్యకర్తలు ఎప్పుడు ఏ విధమైన హల్ చల్ చేస్తారోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎమ్మార్పీయస్ కార్యకర్తలు కొంత మంది సచివాలయంలోకి ప్రవేశించి ఉంటారని ఇంటలిజెన్స్ వర్గాలు సమాచారం అందిస్తాయి. దీంతో సచివాలయ భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. సచివాలయంలోని డీ - బ్లాక్ లో తనిఖీలు చేపట్టారు.

సచివాలయానికి భద్రత పెంచారు. సందర్శకుల పాసులను కూడా రద్దు చేశారు. అంతకు ముందు సచివాలయానికి ఎమ్మార్పీయస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సమయంలో కొంత మంది పోలీసుల కళ్లు గప్పి సచివాలయంలోకి ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు. తమ డిమాండ్ పై ఎమ్మార్పీయస్ నాయకుడు మందకృష్ణ మాదిగ నిరాహార దీక్ష చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X