వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ కుమార్ రెడ్డి నివేదిక వాయిదా ప్రతిపాదనకు దుగ్గల్ నో?

By Pratap
|
Google Oneindia TeluguNews

VK Duggal
న్యూఢిల్లీ‌: శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పణను వాయిదా వేయించాలనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలోని ఎపి భవన్ లో శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య అర గంట పాటు చర్చలు జరిగాయి. చర్చల అనంతరం వికె దుగ్గల్ ముఖం మాడ్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడకుండా ఆయన వెళ్లిపోవడంపై అనుమానాలు తలెత్తాయి. మీడియా ప్రతినిధులు కనిపిస్తే నవ్వుతూ పలకరించే ఆయన అలా వెళ్లిపోవడంపై అనుమానాలు తలెత్తాయి.

నివేదికను డిసెంబర్ 31వ తేదీలోగా సమర్పించవద్దని, కొంత కాలం గడువు తీసుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డి దుగ్గల్ ను కోరినట్లు సమాచారం. అందుకు వికె దుగ్గల్ నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఇరువురి మధ్య కొంత వాడిగానే చర్చలు జరిగినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తాను కాస్తా నిలదొక్కుకోవడానికి సమయం కావాలని, అంత వరకు నివేదికను సమర్పించవద్దని కిరణ్ అడిగినట్లు సమాచారం. ఢిల్లీ స్థాయిలో ఆ రకంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేయడం కూడా దుగ్గల్ కు నచ్చలేదని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X