నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జెపి వ్యాఖ్యలకు నిరసనగా లోక్ సత్తా కార్యాలయంపై దాడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
నిజామాబాద్: సీమాంద్ర, తెలంగాణ విద్యార్థులపై కేసుల విషయంలో అసెంబ్లీల లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నిజామాబాద్ లోని లోక్ సత్తా కార్యాలయంపై తెలంగాణవాదులు దాడి చేశారు. కార్యాలయంపై దాడి చేసి పోస్టర్లు, ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. తెలంగాణ నుండి శాసనసభ్యుడిగా ఎన్నికైన జెపి విద్యార్థులకు వ్యతిరేకంగా మాట్లాడటం దారుణమన్నారు. జెపికి దమ్ముంటే కూకట్ పల్లి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఆయన సొంత నియోజకవర్గం నుండి పోటీ చేయాలని డిమాండ్ చేశారు.

ఉద్యామాలలో విద్యార్థులు ఆవేశపూరితంగా చేసే చర్యలంటూ అన్ని పార్టీల నేతలు వాటిని ఎత్తివేయాలని కోరుతుంటే జెపి ఒక్కరే కఠిన శిక్షలు వేయాలనడమేమిటని ప్రశ్నించారు. జెసిని తెలంగాణలో తిరగనివ్వమని వారు హెచ్చరించారు. విద్వంసాలకు, దాడులకు, బలవంతపు వసూళ్లకు పాల్పడిన వారు ఏ ప్రాంతం వారైనా కఠిన శిక్షలు వేయాలని జేపి అసెంబ్లీలో అన్న విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X