గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
గుంటూరు‌: కాంగ్రెసు ప్రభుత్వంపై మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ నిప్పులు చెరిగారు. గుంటూరు జిల్లాలోని వరద తాకిడి ప్రాంతాల్లో రైతులను పరామర్సించిన ఆయన శనివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. వరద తాకిడి ప్రాంతాల్లోని రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. నాలుగు సార్లు భారీ వర్షాలు వస్తే నష్టాలను కూడా అంచనా వేయలేకపోయిందని ఆయన అన్నారు. జల్ తుపాను నష్టాన్ని కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు అంచనా వేయలేకపోయిందని ఆయన అన్నారు. తన తండ్రి వైయస్సార్ ఉన్నప్పుడు ఇలా జరగలేదని ఆయన అన్నారు.

వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కౌలు రైతులను కూడా ఆదుకోవాలని ఆయన కోరారు. రైతులకు ఇన్ పుట్స్ అందించాలని కూడా ఆయన కోరారు. వైయస్ జగన్ శుక్రవారం ఉదయం హైదరాబాదు నుంచి బయలుదేరి గుంటూరు జిల్లాకు చేరుకున్నారు. గుంటూరు జిల్లాలోని వివిధ గ్రామాల రైతులను ఆయన పరామర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X