హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్రోకరు వైఎస్ కు కెవిపియా, అధిష్టానానికి కాంగ్రెస్సా: ప్రశ్నించిన యనమల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yanamala Ramakrishnudu
హైదరాబాద్‌: రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రారావు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి బ్రోకరా, కాంగ్రెస్ అధిష్టానానికి బ్రోకరా కాంగ్రెస్ పార్టీ చెప్పాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు,మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆదివారం డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిలో వారే అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారన్నారు. సిబిఐతో విచారణ జరిపిస్తే ఎవరు బ్రోకరో తెలిసి పోతుందన్నారు.

కాంగ్రెస్ నాయకులు పదవులు కోసం ఢిల్లీలోనే మకాం వేస్తున్నారని ఆరోపించారు. అదే నాయకులు ఏనాడైనా రాష్ట్రంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల సమస్యలపై ఏనాడైనా ఢిల్లీ వైపు చూశారా అని ప్రశ్నించారు. కాంగ్రస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా పదవులు అంటూ సమస్యల వలయంలో కూరుకు పోతుందన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు తమ సమస్యలు పరిష్కరించమంటూ ఢిల్లీ వైపు చూడటం అలవాటుగా మారిందని దుయ్యబట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X