హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖలో జగన్ కు చెక్ చెప్పేందుకు మంత్రి బాలరాజు యత్నాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Balaraju
హైదరాబాద్: జనవరి 3వ తారీఖునుండి మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర దృష్ట్యా మంత్రి బాలరాజు విశాఖ జిల్లాకు చెందిన ఆరుగురు శాసనసభ్యులతో అసెంబ్లీలోని తన ఛాంబర్లో సమావేశమయ్యారు. శాసనసభ్యులు విజయ్ కుమార్, ద్రోణంరాజు శ్రీనివాస్, విజయ్ ప్రసాద్, ముళ్ల బాబురావు, కన్న బాబురావు, ముత్యాల పాపలతో సమావేశమయ్యారు. విశాఖలో జగన్ ఓదార్పు కారణంగా ఎలా వ్యవహరించాలి అనే విషయాన్ని చర్చించినట్లు తెలుస్తోంది. దాదాపు పదిహేను నిమిషాలు వారు చర్చించుకున్నారు.

సమావేశ అనంతరం శాసనసభ్యులు గానీ, బాలరాజుగానీ విలేకరులతో మాట్లాడటానికి నిరాకరించారు. ఇప్పటికే అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి, మరో సీనియర్ నేత రామకృష్ణ జగన్ వర్గం వైపు మొగ్గుచూపుతున్న దృష్ట్యా మరికొందరు జగన్ వైపు వెళ్లేందుకు అవకాశం లేకుండా చర్చించుకున్నట్లు సమాచారం. జగన్ ఓదార్పుకు జిల్లా కాంగ్రెస్ నేతల నుండి ఎలాంటి సహకారాలు లేకుండా చూడాలని, తద్వారా ఓదార్పును విజయవంతం కాకుండా చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

విశాఖ కాంగ్రెస్ ముఖ్య నాయకుడు, ఎంపీ సబ్బం హరి తాను ఓదార్పులో పాల్గొంటానని, అధిష్టానం ఏమైనా ప్రశ్నిస్తే రాజీనామాకు సిద్ధం అని ప్రకటించడంతో ఓదార్పుపై మంత్రి బాలరాజు దృష్టి పెట్టారు. శాసనసభ్యులతో పాటు, రెండో క్యాడర్ కూడా జగన్ వైపు వెళ్లకుండా ఉండేందుకు అప్పుడే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రైతు సమస్యల పేరుతో కృష్ణా జిల్లాలో పేర్ని నానిని ఆకర్షించిన విషయం దృష్ట్యా ముఖ్యమంత్రి ఆయా జిల్లాల మంత్రులకు ముందు జాగ్రత్తలు చెబుతున్నట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X