వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2జి స్పెక్ట్రం కుంభకోణంపై నిప్పులు చెరిగిన ఎల్ కె అద్వానీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

LK Advani
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలో నిర్ణయాలు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కంటే కార్పెరేట్ లాబీయిస్టులే ఎక్కువగా తీసుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ సీనియర్ పార్లమెంటు సభ్యుడు ఎల్ కె అద్వానీ మంగళవారం కేంద్ర ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. 2జి స్పెక్ట్రం కుంభకోణం విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలను దేశవ్యాప్తంగా వీధివీధినా ప్రచారం చేస్తామని అన్నారు. అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న రాజాను ప్రభుత్వం నుండి తప్పిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.

2జి కుంభకోణంపై జెపిసి వేయాల్సిందేనని అద్వానీ డిమాండ్ చేశారు. దీనిపై భారతీయ జనతా పార్టీ గానీ, ఎన్డీయే పార్టీలుగానీ వెనక్కి తగ్గేది లేదన్నారు. జేపిసి వేసేదాకా పోరాటం చేస్తామన్నారు. ఇప్పటి వరకు జరిగిన కుంభకోణాల్లోకెల్లా 2జి కుంభకోణం చాలా పెద్దదన్నారు. 2జి కుంభకోణంపై జెపిసికి పట్టుబడితే ప్రభుత్వం స్పందించటం లేదన్నారు. మరో మార్గం లేకే పార్లమెంటును స్తంభింప చేశామన్నారు.

పార్లమెంటు ప్రతిష్టంభనకు యూపిఏ ప్రభుత్వమే కారణమన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో కూడా 2జి కుంభకోణంపై పార్లమెంటును స్తంభింప చేస్తామన్నారు. జేపిసికీ యూపిఏలోని కొన్ని పార్టీలు కూడా మద్దతు పలికాయన్నారు. పార్లమెంటులో కాంగ్రెసు ఒంటరి పక్షం అయ్యిందన్నారు. ప్రభుత్వం జెపిసినుండి మాత్రం తప్పించుకోలేదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X