హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ కు శ్రీకృష్ణ కమిటీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Srikrishna Committee
హైదరాబాద్‌: తెలంగాణపై కేంద్ర కమిటీ ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ కమిటీ సభ్యులు గురువారం మధ్యాహ్నం హైదరాబాదుకు రానున్నారు. వారు ఇప్పటికే ఇక్కడి రాష్ట్ర ప్రజల, రాజకీయ నేత అభిప్రాయలను తీసుకున్నారు. ఈ నెలాఖరులోగా కేంద్రానికి నివేదిక అందజేయనున్నందున వారి రాక ప్రాదాన్యత సంతరించుకుంది. నివేదిక నేపథ్యంలో కమిటీకి సహకరించి వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఇక్కడికి వస్తున్నారు. కమిటీ సభ్యులు గురువారం బిజీ షెడ్యూల్ ఏర్పరుచుకున్నారు.

గురువారం మధ్యాహ్నం పదకొండు, పదకొండున్నర ప్రాంతంలో హైదరాబాదుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు వారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ అరవిందరావుతో సమావేశమవుతారు. అనంతరం 12.30కు గవర్నర్‌ నరసింహన్ ను కలుస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలుస్తారు. 3 గంటలనుంచి వివిధపార్టీల నేతలు, ప్రభుత్వ ఉన్నత అధికారులను కలుస్తారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతారు. అనంతరం నేరుగా ఢిల్లీ వెళతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X