కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి జనార్ధన్ రెడ్డితో వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక మంతనాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
కర్నూలు: రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదుపుతున్న మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కర్ణాటక రాజకీయాలను శాసిస్తున్న మంత్రి గాలి జనార్ధన్ రెడ్డితో గురువారం భేటీ విషయం రెండు రాష్ట్రాలలోనూ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్, గాలి జనార్ధన్ రెడ్డి భేటీకి కర్నూలు జిల్లాలోని పాణ్యం శాసనసభ్యుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి కూతురు వివాహ రిసెప్షన్ వేదిక అయింది. గాలి, జగన్ ఇద్దరు రెండు వేరు వేరు హెలికాప్టర్ లలో కర్నూలు చేరుకున్నారు. గాలితో పాటు కర్ణాటక మరో మంత్రి శ్రీరాములు కూడా వచ్చారు. మాజీ శాసనసభ్యులు గౌరు చరితారెడ్డి ఇంటిలో భేటీ అయ్యారు.

రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. గాలి కర్ణాటక మంత్రి అయినప్పటికీ జగన్ కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 21, 22వ తేదీలలో జగన్ చేపట్టబోయే 48 గంటల నిరాహార దీక్షపైన, జనవరిలో ప్రారంభం కానున్న ఓదార్పు యాత్ర, కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభ నియోజకవర్గ ఉప పోరుపై చర్చించినటలు తెలుస్తోంది.

మొదట కర్నూలు చేరుకున్న జగన్ కర్నూలు జిల్లాలోని ముఖ్యనాయకులతో రిసెప్షన్ ఇంటిలోని పై గదిలో చర్చించారు. జగన్ తో తెలుగుదేశం పార్టీ అసమ్మతి శాసనసభ్యుడు బాలనాగిరెడ్డి, లబ్బి వెంకటస్వామిలతో పాటు జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు భేటీ అయ్యారు. జగన్ హెలికాప్టర్ లో నుండి దిగకముందే అందరూ హెలికాప్టర్ ను చుట్టుముట్టారు. ఆ తర్వాత అందరూ జగన్ కు ఘనస్వాగతం పలికారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X