విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ ఏజెన్సీ ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టుల హతం

By Pratap
|
Google Oneindia TeluguNews

Maoists
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయితీ చెరువూరు వద్ద పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఎదురు కాల్పుల్లో ఎస్‌ఐ మోహనరెడ్డికి గాయాలు అయ్యాయి. ఇతన్ని హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించారు. మరో కానిస్టేబుల్ స్వల్పంగా గాయపడ్డాడు.

కాల్పుల అనంతరం తప్పించుకున్న మావోయిస్టుల్లో కీలకనేత ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి భారీగా బలగాలను తరలించారు. దాదాపు 30 మంది మావోయిస్టులు ఏజెన్సీ ఏరియాలో సమావేశమైనట్లు సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X