వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ నిరాహార దీక్ష నిరసన మాత్రమే: సబ్బం హరి

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabbam Hari
విశాఖపట్నం: విజయవాడలో ఈ నెల 20, 21 తేదీల్లో 48 గంటల పాటు చేపట్టే నిరాహారదీక్ష రైతు సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని తెలియజేసే ప్రతీకాత్మక నిరసన మాత్రమేనని వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి చెప్పారు. వైయస్ జగన్ నిరాహారదీక్షకు సంఘీభావంగా అన్ని మండలాల్లో నిరాహారదీక్షలు చేపడతామని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తాము రాజకీయాలకు అతీతంగా ఈ దీక్ష చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

విశాఖ జిల్లాలో ఓదార్పుయాత్ర షెడ్యూల్ ఖరారు అయ్యింది. ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ఓదార్పుయాత్ర రూట్ మ్యాప్‌ను శనివారం ఇక్కడ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ వచ్చే నెల 3వ తేదీ నుంచి 17 నియోజకవర్గాల్లో ఎనిమిది రోజుల పాటు యాత్ర జరుగుతుందన్నారు. చనిపోయినవారు ఏ పార్టీ వారైనా ఓదార్చటం జరుగుతుందని ఆళ్ల నాని అన్నారు.పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో మమేకం కావటం జరుగుతుందన్నారు.

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణ వార్తను జీర్ణించుకోలేక చనిపోయిన 17 కుటుంబాలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించనున్నారు. ఎంపీ సబ్బం హరి నేతృత్వంలో ఓదార్పు యాత్ర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X