వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ జగన్ నిరాహార దీక్ష నిరసన మాత్రమే: సబ్బం హరి
విశాఖ జిల్లాలో ఓదార్పుయాత్ర షెడ్యూల్ ఖరారు అయ్యింది. ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ఓదార్పుయాత్ర రూట్ మ్యాప్ను శనివారం ఇక్కడ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ వచ్చే నెల 3వ తేదీ నుంచి 17 నియోజకవర్గాల్లో ఎనిమిది రోజుల పాటు యాత్ర జరుగుతుందన్నారు. చనిపోయినవారు ఏ పార్టీ వారైనా ఓదార్చటం జరుగుతుందని ఆళ్ల నాని అన్నారు.పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో మమేకం కావటం జరుగుతుందన్నారు.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణ వార్తను జీర్ణించుకోలేక చనిపోయిన 17 కుటుంబాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించనున్నారు. ఎంపీ సబ్బం హరి నేతృత్వంలో ఓదార్పు యాత్ర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా పాల్గొన్నారు.
Comments
వైయస్ జగన్ విశాఖపట్నం సబ్బం హరి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు నిరాహార దీక్ష ys jagan viskahapatnam sabbam hari congress mp fast
Story first published: Saturday, December 18, 2010, 14:31 [IST]