వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్, విజయశాంతి ఎందుకు రాజీనామా చేయలేదు: కోమటిరెడ్డి సోదరులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kcr and Vijayashanthi
న్యూఢిల్లీ: 2011లో తెలంగాణ రాష్ట్రం తప్పకుండా వస్తుందని భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం ఢిల్లీలో విలేకరులతో వ్యాఖ్యానించారు. వచ్చే సంవత్సరం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. రాజీనామాలు చేసినంత మాత్రాన తెలంగాణ రాష్ట్రం రాదన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు.

రాజీనామాలతో తెలంగాణ వస్తుందని నిత్యం జపిస్తున్న మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు, మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి ఎందుకు రాజీనామా చేయడం లేదన్నారు. రాష్ట్రంలో 41 పార్లమెంటు స్థానాలు సాధించి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. 2014లో రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడానికి కృషి చేస్తామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కోరిక కూడా అదేనన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X