మధ్యంతర ఎన్నికలపైనే వైయస్ జగన్ గురి, కెసిఆర్ చూపు కూడా?
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూడా మధ్యంతర ఎన్నికలనే ఆశిస్తారని ఆయన అన్నారు. మధ్యంతర ఎన్నికలు వస్తే రాష్ట్రంలో కాంగ్రెసు తుడిచిపెట్టుకు పోతుందని ఆయన అన్నారు. సీమాంధ్రలో వైయస్ జగన్ పార్టీ స్వీప్ చేస్తుందని, తెలంగాణలో తెరాస స్వీప్ చేస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ మాటలను బట్టి కాంగ్రెసును దెబ్బ కొట్టడానికి కెసిఆర్, వైయస్ జగన్ ఒక్కటవుతారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గానీ ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గానీ తెలంగాణలోనే కాకుండా సీమాంధ్రలోనూ ఏమీ చేయలేరని వారు భావిస్తున్నారు. మధ్యంతర ఎన్నికలను పసిగట్టే రైతు సమస్యలపై చంద్రబాబు నిరాహార దీక్ష చేపట్టినట్లు భావిస్తున్నారు.
శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత పరిస్థితులు రాష్ట్రంలో అదుపు తప్పే ప్రమాదం ఉందని కూడా భావిస్తున్నారు. డిసెంబర్ 31వ తేదీ తర్వాత తీవ్రమైన పరిణామాలుంటాయని, రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితిలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు చేయాలని వైయస్ జగన్ భావిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.