వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసు కార్యాలయంపై కెయు విద్యార్థుల దాడి, కాంగ్రెసు నేతలకు హెచ్చరిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Kakatiya University
హైదరాబాద్‌/ వరంగల్: తెలంగాణ విద్యార్థులపై కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆందోళనకు దిగారు. వరంగల్ లోని జిల్లా కాంగ్రెసు కార్యాలయంపై కెయు జెఎసి కార్యకర్తలు దాడి చేశారు. ఫ్లెక్సీలను, ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. విద్యార్థులపై కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష సాగిస్తున్న ఉస్మానియా విద్యార్థుల ఆరోగ్యం క్షీణించింది. వారిని హైదరాబాదులోని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. అయితే వారు చికిత్సకు నిరాకరిస్తున్నారు. ఈ స్థితిలో హైదరాబాదులోని ఉస్మానియా, వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు.

కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు కాంగ్రెసు నాయకులను హెచ్చరిస్తున్నారు. జైల్లోని విద్యార్థుల విడుదలకు వెంటనే చర్యలు తీసుకోకపోతే కాంగ్రెసు నాయకులను నగర పొలిమేరల్లో అడుగు పెట్టనివ్వబోమని వారు హెచ్చరించారు. రేపు మంగళవారం మంత్రుల ఇళ్లు ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు రిలే నిరాహార దీక్షకు దిగారు. కాగా, విద్యార్థులపై కేసుల ఎత్తివేతను పరిశీలిస్తున్నామని హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చెప్పారు. వరంగల్ లో డిసిసి కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో పోలీసులు వాసుదేవరెడ్డి, క్రాంతి, శ్రీకాంత్ తదితర విద్యార్థులను అరెస్టు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X