వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ దీక్షకు మద్దతిచ్చిన శాసనసభ్యులపై చర్యలు?

By Pratap
|
Google Oneindia TeluguNews

V Hanumantha Rao
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ లక్ష్యదీక్షకు మద్దతిచ్చిన పార్టీ శాసనసభ్యులపై కాంగ్రెసు అధిష్టానం చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓదార్పు యాత్ర సమయంలో వైయస్ జగన్ పార్టీలో ఉన్నారు కాబట్టి అప్పుడు ఓదార్పు యాత్రకు వెళ్లినవారిపై తమ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు జగన్ పార్టీలో లేరు కాబట్టి చర్యలు తీసుకుంటుందని కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. జగన్ లక్ష్యదీక్షకు హాజరైన శాసనసభ్యులపై తాను అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు. దీన్ని బట్టి శాసనసభ్యులపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవచ్చుననే మాట వినిపిస్తోంది.

వైయస్ జగన్ దీక్షకు వెళ్లిన శాసనసభ్యులపై ఎఐసిసి కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా తీవ్రంగా ధ్వజమెత్తారు. అయితే, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అధిష్టానం చర్యలు తీసుకుంటుందా అనే అనుమానం కలుగుతోంది. జగన్ కు మద్దతు తెలుపుతున్న శాసనసభ్యుల సంఖ్య బయటికే 25 దాకా కనిపిస్తోంది. లోలోపల జగన్ కు ఎంత మంది మద్దతు తెలుపుతున్నారనే అంచనా లేదు. దీంతో ప్రభుత్వం పడిపోతుందేమోననే ఆందోళనతో కాంగ్రెసు అధిష్టానం వెనక్కి తగ్గవచ్చునని అంటున్నారు. వైయస్ జగన్ తనంత తానుగా ప్రభుత్వాన్ని కూల్చడానికి వచ్చే దాకా నిరీక్షించాలని కూడా అనుకుంటూ ఉండవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X