కర్నూలు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య
ఆస్తి తగాదాలే ఈ ఘటనకు కారణమని స్థానికులు అంటున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులను ఎల్లప్ప భార్య, పిల్లలుగా గుర్తించారు. ఎల్లప్పకు ఇద్దరు భార్యలున్నారు. ఎల్లప్ప కొన్ని రోజుల క్రితం మరణించాడు. అతనికి పది ఎకరాల భూమి ఉంది. దీంతో ఆస్తి కోసం ఎల్లప్పకు చెందిన మరో భార్యకు చెందినవారే ఈ హత్యలు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
Comments
Story first published: Thursday, December 23, 2010, 9:39 [IST]