వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోహిత్ కేసులో ఎన్డీ తివారీకి డిఎన్ఎ పరీక్షలకు హైకోర్టు ఆదేశాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

ND Tiwari
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీకి డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని పేర్కొంటూ గురువారం ఢిల్లీ హైకోర్టు జస్టిస్ ఎస్. రవీంద్ర బాత్ ఆదేశాలను జారీ చేశారు. ఇందుకు రక్తనమూనాలు ఇవ్వాలని, అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరి ఎనిదవ తేదీ లోపు హైకోర్టు జాయింట్ రిజిష్ట్రార్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. తివారీని తన తండ్రిగా పేర్కొంటూ రోహిత్ శేకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు విషయం విదితమే.

మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెసు నాయకుడు షంషేర్ సింగ్ మనవడు రోహిత్ శేఖర్ తన తండ్రి తివారీయేనని ఢిల్లీ హైకోర్టులో గతంలో పిటిషన్ వేశారు. తన తల్లి ఉజ్వల సింగ్ తో తివారీకి గల వైవాహికేతర సంబంధంతోనే తాను పుట్టానని రోహిత్ శేఖర్ పిటిషన్ వేశారు. తనను కుమారుడిగా అంగీకరించడానికి నిరాకరించినందు వల్లనే పిటిషన్ వేసినట్లు రోహిత్ శేఖర్ చెప్పాడు. తాను గౌరవప్రదమైన కుటుంబానికి చెందినదానినని, తన తండ్రి కేంద్ర మాజీ మంత్రి అని, అటువంటి సమాచారం వెల్లడించడానికి తెగువ కావాలని, తాను తన కుమారుడు రోహిత్ కు అండగా నిలబడుతున్నానని అప్పట్లో ఉజ్వల సింగ్ అన్నారు. రోహిత్ శేఖర్ డిఎన్ఎ పరీక్షకు అంగీకరిస్తున్నాడని, అయితే తివారీ అందుకు నిరాకరిస్తున్నారని ఆమె అప్పట్లో చెప్పారు.

రోహిత్ వేసిన పిటిషన్ పై రాష్ట్ర గవర్నర్ ఎన్డీ తివారీ కోర్టు విచారణ పరిధిని ప్రశ్నించారు. తాను ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నానని, రోహిత్ లక్నోలో పుట్టాడని, అందువల్ల ఢిల్లీలో విచారణ సరైంది కాదని ఆయన వాదించారు. రోహిత్ పిటిషన్ ను కోర్టు ఏప్రిల్ లో విచారణకు స్వీకరించి, తివారీకి నోటీసులు పంపింది. రోహిత్ ను కొడుకుగా తివారీ స్వీకరించాలని అప్పట్లో షంషేర్ సింగ్ అన్నారు. ఈ విషయంపై పార్టీ నాయకత్వానికి కూడా ఆయన లేఖ రాశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X