శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ కు లక్ష్యమే లేదు: పిసిసి అధికార ప్రతినిధి తులసీరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tulasi Reddy
శ్రీకాకుళం: రైతాంగ సమస్యలపై 48 గంటల నిరాహార దీక్షకు దిగిన మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అసలు లక్ష్యమే లేదని పిసిసి అధికార ప్రతినిధి ఎన్.తులసీరెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లాలో విలేకరుల సమావేశంలో అన్నారు. ప్రభుత్వానికి నూకలు చెల్లాయని జగన్ వర్గం అనడంలో ఏమాత్రం నిజం లేదన్నారు. ప్రభుత్వంపై ప్రజలు మంచి నమ్మకంతో ఉన్నారన్నారు.

ప్రజల దృష్టిని మరల్చడానికే కొందరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. జగన్ వర్గం ప్రభుత్వంపై చేస్తున్న వ్యాఖ్యలు పిల్లి శాపనార్థాల వంటివన్నారు. పిల్లి శాపనార్థాలు ఏవీ నిజం కావన్నారు. దివంగత వైయస్ అడుగు జాడల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నడుస్తున్నారన్నారు. చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్ష చేయటం సరికాదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X