హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ఆస్తులపై దర్యాప్తు చేయించాలని గోనె సవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gone Prakash Rao
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిని విమర్శిస్తే ప్రజలు సహించరని వైయస్ జగన్ వర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గోనె ప్రకాశరావు శుక్రవారం విలేకరులతో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధిని విస్మరిస్తే ప్రభుత్వం పడిపోతుందన్నారు. అభివృద్ధిని విస్మరించరాదని సూచించారు. వైయస్ చూపిన బాటలో నడుస్తామంటున్న ప్రభుత్వం ఆ బాటలోనే నడవాలన్నారు.

మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి, అక్రమాలపై ధ్వజమెత్తుతున్న వారు దమ్ముంటే ఆయనపై సిబిఐ, ఏసిబి అధికారులతో దర్యాఫ్తు చేయించాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం తెలంగాణ రాష్ట్రానికై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు చేసిన నిరాహార దీక్షలోని నిజాలు వైద్య, ఆరోగ్య శాఖమంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి బహిర్గతం చేయాలన్నారు. భవిష్యత్తులో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ గుర్తుతోనే నిర్వహించాలని ఆయన కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X