విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వారి విజ్ఞతకే వదిలేస్తున్నా: వైయస్ జగన్ పై లోక్ సత్తా జెపి పరోక్ష వ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayaprakash Narayana
విజయవాడ: రైతాంగ సమస్యలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష నిజం కాదనటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ శుక్రవారం మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను ఉద్దేశించి అన్నారు. రైతుల సమస్యలపై చంద్రబాబు దీక్ష సబబే అని చెప్పారు. చంద్రబాబు దీక్ష విరమించి రాష్ట్ర సమస్యలపై, రైతాంగ సమస్యలపై దీర్ఘకాలిక పోరాటాలకు సిద్ధం కావాలని సూచించారు.

చంద్రబాబు దీక్షకు అన్ని వర్గాలనుండి, అన్ని ప్రాంతాల నుండి మద్దతు లభించిందని చెప్పారు. ప్రభుత్వ విధానాల కారణంగానే ఒక్క పంట వేసిన రైతు కూడా ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలిక డిమాండ్ల వల్ల లాభం లేదని ఆయన చంద్రబాబుకు సూచించారు. రాష్ట్ర సమస్యలపై దీర్ఘకాలిక సమస్యలపై పోరాడాలని ఆయనకు సూచించారు. వ్యవసాయంపై ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో ఉల్లి, టమోటా ధరలను చూస్తేనే అర్థమవుతోందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X