హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ హైదరాబాద్ విడిదికి తెలంగాణ సెగ?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pratibha Patil
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కు తెలంగాణ భయం పట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం ప్రతిభా పాటిల్ ప్రత్యేక విమానంలో శీతాకాల విడిది కోసం హైదరాబాదుకు చేరుకున్నారు. ఆమెకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ దంపతులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి శీతాకాలపు విడిది సందర్భంగా ఇక్కడే పదిహేను రోజులు ఉండాల్సి ఉండగా ఆమె ముందుగానే ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

ఈ నెలాఖరున తెలంగాణ అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక కేంద్రానికి సమర్పించనున్నారు. నివేదిక కారణంగా అటు సీమాంధ్రలోగానీ, ఇటు తెలంగాణలోగాని ఉద్రిక్త పరిస్థితులు చెలరేగే అవకాశమున్నందున ముందుగానే ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి నివేదిక సమర్పించేకన్నా ముందుగానే ఆమె హైదరాబాద్ నుండి పయనమవుతారు.

కాగా, రాష్ట్రపతి హైదరాబాద్ కు స్వాగతం చెప్పే సమయంలో ప్రొటోకాల్ సమస్య తలెత్తింది. దానం నాగేందర్, తదితర మంత్రులను విమానాశ్రయం లోనికి వెళ్లడానికి అధికారులు అనుమతించలేదు. దీంతో దానం నాగేందర్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయినా ఫలితం లేకపోయింది. ఈ విషయాన్ని తాము ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్తామని రాష్ట్ర చేనేత శాఖ మంత్రి పి. శంకరరావు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X