హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైతులు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తారు: ఎర్రంనాయుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yerram Naidu
హైదరాబాద్: ప్రభుత్వం అంటే అధికార పార్టీ అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రంనాయుడు శుక్రవారం ధ్వజమెత్తారు. తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తే సమస్య పరిష్కారం అవుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు ఉన్నారన్నారు. ఆయన అలా ఊహించుకుంటే తప్పని చెప్పారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందన్నారు.

రైతులపట్ల కనికరం లేని ముఖ్యమంత్రికి మంచి ఆలోచన ఇవ్వాలని ఆ దేవుడిని పార్థిస్తున్నానని ఆయన చెప్పారు. అద్బుత సాయం అని ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటుందని, అద్బుతమైన సాయమే అయితే రైతుల ఆత్మహత్యలు ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రికి వ్యవసాయంపై ఏమాత్రం అవగాహన లేదన్నారు. రైతుల న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించకపోతే రైతులు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తారన్నారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవితో సహా అన్ని పార్టీల వారు ఈ సాయం సరిపోదని చెబుతుంటే ప్రభుత్వం వినిపించుకోవటం లేదన్నారు. ప్రభుత్వానికి కనీస మానవత్వం లేకుండా పోయిందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X