నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అధికారమే లక్ష్యంగా వైఎస్ జగన్ కొత్త పార్టీ: లోక్ సత్తా జయప్రకాశ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayaprakash Narayana
నెల్లూరు: మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారమే పరమావధిగా చూస్తున్నారని లోక్ సత్తా అధ్యక్షుడు, శాసనసభ్యుడు జయప్రకాశ్ నారాయణ నెల్లూరు జిల్లాలో ఆదివారం ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ పార్టీ అధికారమే లక్ష్యంగా పుట్టుకు వస్తుందన్నారు. తెలంగాణ సమస్యను కొన్ని పార్టీలు జీవన్మరణ సమస్యగా చిత్రీకరిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఉద్దేశించి అన్నారు.

వ్యవసాయాన్ని నాశనం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు ఉన్నాయన్నారు. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తే దేశం అభివృద్ధిలో వెనక బడుతుందన్నారు. రైతు సమస్యలపై ఎవరు స్పందించినా మద్దతు ఉంటుందన్నారు. 30వ తారీఖున తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించనున్న రైతు గర్జనకు వెళతానని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X