వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

31వ తేదిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక కేంద్రానికి ఇస్తాం: దుగ్గల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

VK Duggal
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై తమ నివేదికను డిసెంబర్ 31వ తారీఖున కేంద్రానికి సమర్పిస్తామని శ్రీకృష్ణ కమిటీ చైర్మన్ వికె దుగ్గల్ సోమవారం విలేకరుల ప్రతినిధులతో స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి చిదంబరానికి నివేదికను ఇచ్చే దిశలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. హోంమంత్రి చిదంబరం ప్రస్తుతం అందుబాటులో లేనందున 31వ తేదిన నివేదికను ఇస్తామని వికె దుగ్గల్ చెప్పారు.

కాగా శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి చిదంబరానికి ఇస్తుందని కొన్ని వార్తలు వచ్చాయి. కమిటీ కూడా హైదరాబాదులో చివరి పర్యటన సందర్భంగా డిసెంబర్ 31న గానీ అంతకంటే ముందుగాని ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే చిదంబరం అందుబాటులో ఉంటే తాము డిసెంబర్ 31 కంటే ముందుగానే నివేదికను కేంద్రానికి సమర్పించేవారమన్నారు. ఆయన అందుబాటులో లేనందునే నెలాఖరున ఇస్తున్నట్టు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X