విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెకె డైరెక్షన్, కెసిఆర్ స్ర్కీన్ ప్లే: తెలంగాణ ఎంపీల దీక్షపై జోగి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jogi Ramesh
విజయవాడ: ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యుల దీక్షకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె కేశవరావు దర్శకుడు అని, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్క్రీన్ ప్లే అని కృష్ణా జిల్లా శాసన సభ్యుడు జోగి రమేష్ సోమవారం వ్యాఖ్యానించారు. కె కేశవరావుకు బ్లాక్ మెయిల్ రాజకీయాలు ముందునుండి అలవాటేనని ఆరోపించారు.

తెలంగాణ విద్యార్థులపై కేసులు ఎత్తివేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంటు సభ్యుల ఒత్తిడులకు ప్రభుత్వం లొంగవద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి కుట్ర జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రజానీకం అంతా నివేదికకు కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X