విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం కిరణ్ కు క్రికెట్ పైనే అవగాహన ఎక్కువ: ఎర్రన్నాయుడు ఎద్దేవా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yerram Naidu
విజయవాడ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి క్రికెట్ గురించి తెలిసినంత రైతు సమస్యలపై అవగాహన లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడు బుధవారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విమర్శించారు. రైతుకోసం గుంటూరులోని బిఆర్ గ్రౌండ్ వేదికగా జరగనున్న తెలుగుదేశం పార్టీ బహిరంగసభకు రాష్ట్రంనుండి లక్షలాదిగా తరలి వస్తున్నారని, జిల్లా నుండి భారీ ఎత్తున తరలి రావాలని ఆయన కోరారు.

ముఖ్యమంత్రికి వ్యవసాయంపై అవగాహన, కౌలురైతుల కష్టాలు, పంట నష్టం అంచనాలు ఏమీ తెలియవని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యపై ఒక్కో పత్రికలో ఒక్కో విధంగా ఇస్తున్నాయని అందులో నిజాలు తెలుసుకొని ఇవ్వాలని సూచించటం సరియైనది కాదన్నారు. తన తప్పును కప్పి పుచ్చుకోవడానికి పత్రికలను, ప్రతిపక్షాలను విమర్శించడమే ముఖ్యమంత్రి ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు. కేంద్రం ప్రకటించిన 400 కోట్ల రూపాయల ప్యాకేజి ఎందుకూ సరిపోదన్నారు. కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు సాయం బాగుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X