హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రాంతీయ ఉద్యమాలతో మిగులు జలాలు కోల్పోయాం: పీఆర్పీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ramachandraiah
హైదరాబాద్: మన రాష్ట్రంలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటల వల్లే కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు ద్వారా నీటిని కోల్పోయామని ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నాయకుడు సి.రామచంద్రయ్య విమర్శించారు. రాష్ట్రంలో తెలంగాణ, సమైక్యాంధ్ర కుమ్ములాటలతో రాష్ట్ర ప్రయోజనాలు పక్క రాష్ట్రాలకు పోతున్నాయన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం శక్తివంతంగా వాదించలేక పోవటం వల్ల కూడా కృష్ణా జలాల్లో మనకు సరియైన న్యాయం దక్కలేదన్నారు. ట్రిబ్యునల్ తీర్పుపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఇంతకుముందు మిగులు జలాలు పూర్తిగా మనమే ఉపయోగించుకున్నప్పటికీ, ఇప్పుడు అందులో కూడా వాటా పంచుకోవాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని అన్ని పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒకే త్రాటిపైకి రావాలని ఆయన కోరారు. అప్పుడే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోగలుగుతామన్నారు. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా అల్మట్టి డ్యాంపై నెగ్లెక్టు చేశారని విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X