వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిదంబరంతో భేటీ: నివేదిక సమర్పణకు సమయం కోరిన దుగ్గల్

By Pratap
|
Google Oneindia TeluguNews

VK Duggal
న్యూఢిల్లీ‌: కేంద్ర హోం మంత్రి పి. చిదంబరంతో శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ గురువారం ఉదయం సమావేశమయ్యారు. నివేదిక సమర్పణకు సమయం కేటాయించాలని ఆయన చిదంబరాన్ని కోరారు. ఏ సమయంలోనైనా శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను చిదంబరానికి సమర్పించే అవకాశం ఉంది. అంతకు ముందు శ్రీకృష్ణ కమిటీ సభ్యులు సమావేశమై చివరిసారిగా నివేదికను పరిశీలించారు. నివేదికపై వారంతా సంతకాలు చేశారు.

కాగా, శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులు తమ ఉన్నాయని ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చెప్పుకుంటోంది. అయితే, రాష్ట్రంలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని వాటిని వెల్లడించలేదని చెబుకుంటోంది. శ్రీకృష్ణ కమిటీ సభ్యులు గురువారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత నివేదికను సమర్పించి, చిదంబరానికి తాము చేసిన కృషిని వివరించనున్నారు. ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ సభ్యులు మీడియాతో కూడా మాట్లాడుతారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో పెద్ద యెత్తున కేంద్ర బలగాలను దించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X