వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం విచారకరం: వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ‌: రైతు సమస్యలపై విన్నవించేందుకు తనకు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అపాయింట్ మెంటు ఇవ్వకపోవడం విచారకరమని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అన్నారు. ఆయన గురువారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ను కలిసి రైతులకు పరిహారం పెంచాలని కోరారు. రైతులను ఆదుకోవటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ఆయన అన్నారు. శరద్ పవార్ తో భేటీ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని తాము శరద్‌పవార్‌ను కోరామన్నారు. ఇదే విషయాన్ని సాధ్యమైనంత త్వరలో ప్రధాని దృష్టికి తీసుకువెళతానన్నారని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు.

రైతుకు మంచి జరిగితేనే రాష్ట్రం బాగుపడుతుందని జగన్ అన్నారు. రాష్ట్ర రైతుకు దెబ్బ మీద దెబ్బ పడుతోందన్నారు. తుఫాను, అకాల వర్షాలు అన్నదాతను ముంచేశాయన్నారు. వ్యవసాయం సమస్యల వలయంలో చిక్కుకుపోయిందని ఆయన అన్నారు. వరుస విపత్తులతో రాష్ట్ర రైతులు అల్లాడుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రాష్ట్ర సర్కార్ రైతులకు అందించే సాయంలో ఎన్నెన్నో సందేహాలు తలెత్తుతున్నాయన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అపాయింట్‌మెంట్ కోరామని, అయితే ఆయన ఇవ్వలేదని జగన్ తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X