వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాక్ పాట్: శ్రీకృష్ణ ఆర్థిక సంస్కరణల చైర్మన్ గా శ్రీకృష్ణ?

By Srinivas
|
Google Oneindia TeluguNews

BN Srikrishna
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై తన నివేదికను అనుకున్న సమయంలో పూర్తి చేసిన జస్టిస్ శ్రీకృష్ణకు కేంద్ర ప్రభుత్వం మరో పని అప్పగించడానికి తయారయినట్లుగా తెలుస్తోంది. మాజీ ప్రధాని పివి నరసింహారావు హయాంలో పుట్టుకు వచ్చిన ఆర్థిక సంస్కరణలు కొద్దో గొప్పో అమలు కావటం వల్లే మూడేళ్ల క్రితం అగ్రరాజ్యం అమెరికాతో సహా అన్ని ప్రపంచాన్ని గడగడలాడించిన ఆర్థిక మాంద్యం భారత్ ను మాత్రం కుదిపేయలేక పోయింది. అయితే ఆ ఆర్థిక సంస్కరణలు ఇప్పటికీ సరిగా అమలు కావటం లేదు.

దీంతో కేంద్ర ఆర్థిక శాఖ ఆర్థిక సంస్కరణల రూపకల్పన సమర్థవంతంగా చేయాలని అనుకుంటోంది. ఆ బాధ్యతలను జస్టిస్ శ్రీకృష్ణపై పెట్టాలని యోచిస్తున్నట్టు ఉంది. ఆయనను ఆర్థికరంగ చట్ట సంస్కరణల కమిటీ చైర్మన్ గా నియమించాలనుకుంటున్నట్టు సమాచారం. గత ఫిబ్రవరిలో తెలంగాణపై కేంద్రం జస్టిస్ శ్రీకృష్ణను నియమించింది. నియమించినప్పుడే 2010 డిసెంబర్ 31కల్లా 11 నెలల్లో తన నివేదికను సంపూర్ణంగా కేంద్రానికి అందిస్తానని చెప్పారు. అన్నట్టుగానే ఆయన డిసెంబర్ 31లోపు సమర్పించారు.

అంతేకాకుండా రాష్ట్రంలో అందరి ద్వారా పూర్తి సమాచారం తీసుకున్నారు. కేంద్రం అప్పజెప్పిన తెలంగాణ అంశంపై తన పనిని గడువులోపు పూర్తి చేయడమే కాకుండా, సమర్థవంతంగా పని చేసి కేంద్రం మన్ననలు పొందారు. ఈ కారణంగానే ఆయన అతి బరువైన ఆర్థిక సంస్కరణల అమలు బాధ్యతను అప్పజెప్పేందుకు ఆర్థిక శాఖ సిద్ధమయినట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X