హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ సిపిపై వివక్ష అంటూ సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఓయూ జెఏసి ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: మాజీ సైబరాబాదు పోలీసు కమిషనర్ ప్రభాకర్‌రెడ్డి తెలంగాణకు చెందిన వ్యక్తి కావటం వల్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆయనపై వివక్ష చూపించారని ఉస్మానియా విశ్వవిద్యాలయం జాయింట్ యాక్షన్ కమిటీ ఆదివారం తీవ్రస్థాయిలో మండిపడింది. ముఖ్యమంత్రి తెలంగాణకు చెందిన మాజీ సైబరాబాదు పోలీసు కమిషనర్ ప్రభాకర్ రెడ్డికి అదనపు డిజిపిగా పదోన్నతిని అడ్డుకున్నారని వారు ఆరోపించారు. ముందునుండి ప్రభాకర్ రెడ్డి పేరు అదనపు డిజిపిగా పదోన్నతి పొందే వారి పేర్లలో ఉందన్నారు.

అయితే ముఖ్యమంత్రి కిరణ్ తెలంగాణపై వివక్షతోనే ఆయనను తొలగించారని ఆరోపించారు. ఇందుకు నిరసనగా తెలంగాణకు చెందిన అందరు పోలీసులు గన్ డౌన్ చేయాలని విద్యార్థులు పిలుపునిచ్చారు. హోంమంత్రి సబితారెడ్డి ముఖ్యమంత్రికి ఫోన్ చేసినప్పటికీ ఆయన స్పందించలేదన్నారు. హోంమంత్రి మాటను కూడా ఆయన లెక్కలోకి తీసుకోలేదన్నారు. ముఖ్యమంత్రి ఒక్కరోజు ముందుగా ఫైలుపై సంతకం చేస్తే సరిపోయేదని అయితే ఆయన అందుకు పూనుకోలేదన్నారు. గ్రూపు నుండి సెలక్టు అయి అడిషనల్ డిజిపిగా ఎదిగిన వ్యక్తిగా ఆయన పేరు రికార్డులలో ఉంటుందనే వివక్ష చూపించారని ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X