వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెరాస అధ్యక్షుడు కెసిఆర్ మాట కాదన్న సిపిఐ నేత నారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narayana
హైదరాబాద్: తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీ సమర్పించిన నివేదికపై రాష్ట్రంలోని అన్ని పార్టీల నిర్ణయాలు తీసుకోవడానికి హోంమంత్రి చిదంబరం ఈ నెల 6న ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి పాల్గొనదని ఆ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు ఆయన సిపిఐ నేత నారాయణకు ఫోన్ చేసి అఖిలపక్షానికి వెళ్లవద్దని కోరారు.

అఖిల పక్షానికి ప్రతి పార్టీనుండి ఒక్కరిని పిలిస్తే ఫలితం ఉంటుందని, ఇద్దరిని పిలవటం వల్ల ఫలితం ఉండదని అందుకే అఖిలపక్షానికి వెళ్లవద్దని కోరారు.అయితే నారాయణ కెసిఆర్ వ్యాఖ్యలను సున్నితంగా తిరస్కరించారు. అఖిలపక్షానికి కేంద్రం పిలిచినప్పుడు వెళ్లి మన అభిప్రాయం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. కాబట్టి తమ పార్టీనుండి మేం వెళ్లి మా అభిప్రాయాన్ని హోంమంత్రి చిదంబరానికి తెలియజేస్తామని చెప్పినట్టు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X