వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ సంక్లిష్టమైన సమస్య: కాంగ్రెసు అధికార ప్రతినిధి సింఘ్వీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Abhishek Singhvi
న్యూఢిల్లీ: తెలంగాణ అంశం ఒక సంక్లిష్టమైన సమస్య అని కాంగ్రెసు అధికార ప్రతినిధి అభిషేక్‌సింఘ్వీ సోమవారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. తెలంగాణ అంశంపై శాశ్వత పరిష్కారానికి విస్తృతస్థాయి చర్చలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై అన్ని పార్టీలు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. జనవరి 6వ తేదిన కేంద్ర హోంమంత్రి చిదంబరం ఏర్పాటు చేసిన అఖిలపక్షానికి అన్ని పార్టీల వారు రావాలని ఆయన కోరారు.

అఖిలపక్షాన్ని బహిష్కరించడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. సమావేశానికి హాజరు కాకపోవటం సరియైన నిర్ణయం కాదన్నారు. తెలంగాణకోసం నిర్మాణాత్మక సహకారం అన్ని పార్టీలనుండి అవసరమని అన్నారు. అందుకోసం పార్టీలన్నీ హాజరు కావాలని కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X